News April 24, 2025
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు..!

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకోవడం, దేశ సరిహద్దుల్లో సైన్యం తరలింపు, మిస్సైళ్ల ప్రయోగంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనేదానిపై వీరు చర్చించినట్లు సమాచారం.
Similar News
News April 19, 2026
రేపే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం

AP: ఏడాది పొడవునా చందనంతో కొలువుదీరి ఉండే విశాఖలోని సింహాచలం లక్ష్మీనృసింహస్వామి(అప్పన్న) రేపు నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. 2 లక్షల మంది అప్పన్నను దర్శించుకుంటారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. 40వేల మందికి వివిధ టోకెన్ల ద్వారా, మిగతావారికి ఉచిత దర్శనం కల్పించనున్నట్లు వారు తెలిపారు. 2,300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.
News April 19, 2026
అశ్వగంధ ఆకులతో హాని.. వాడొద్దు: FSSAI

ఔషధాలు, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు లేదా దాని సారాన్ని మాత్రమే వాడాలని తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశించింది. ఆకులను పౌడర్ రూపంలో లేదా వేరే ఏ ఇతర రూపంలోనూ వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆకుల వాడకం వల్ల కాలేయం, నరాలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్నీ వాడుతున్నదీ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది.
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.


