News July 15, 2024
వార్నర్ను పరిగణనలోకి తీసుకోం: బెయిలీ

అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన డేవిడ్ వార్నర్ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా సెలక్టర్ బెయిలీ స్పష్టం చేశారు. అతని కెరీర్ విజయవంతంగా సాగిందన్నారు. మూడు ఫార్మాట్లకు ఆయన సేవలు అందించినా ప్రస్తుతం జట్టు వేర్వేరు ఆటగాళ్లతో వెళ్తోందని తెలిపారు. అంతకుముందు జట్టుకు అవసరమైతే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పారు.
Similar News
News February 16, 2026
భారత్ పవర్ఫుల్ కంట్రీ: నెతన్యాహు

భారత ప్రధాని మోదీ వచ్చే వారం తమ దేశంలో పర్యటించి, పార్లమెంటులో ప్రసంగించనున్నారని ఇజ్రాయెల్ PM నెతన్యాహు వెల్లడించారు. ‘IND పవర్ఫుల్, పాపులర్ కంట్రీ. ఇరు దేశాల మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. ద్వైపాక్షిక సంబంధాలపై మేం చర్చించనున్నాం’ అని తెలిపారు. కాగా ఈ నెల 25, 26 తేదీల్లో PM పర్యటన ఉంటుందని సమాచారం. మోదీ తొలిసారి 2017లో ఇజ్రాయెల్లో పర్యటించి, ఆ దేశానికి వెళ్లిన తొలి భారత PMగా రికార్డు సృష్టించారు.
News February 16, 2026
రూ.15,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం స్థిరంగా ఉన్న వెండి ధర సాయంత్రానికి భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.15వేలు తగ్గడంతో రూ.2,65,000లకు చేరింది. ఇక బంగారం ధరల్లో మార్పు లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,56,440, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,400 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 16, 2026
JEE ఫలితాలు వచ్చేశాయ్

జేఈఈ-2026 ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని NITలు, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏపీకి చెందిన నరేంద్రబాబు, పసల మోహిత్, తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు <


