News August 5, 2024

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో వాషింగ్టన్, స్మృతి, షెఫాలీ

image

గత నెల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు అభ్యర్థుల్ని ఐసీసీ ప్రకటించింది. వీరిలో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(జింబాబ్వే, శ్రీలంకలో ప్రదర్శన), ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్‌సన్(వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌లో ప్రదర్శన), స్కాట్లాండ్‌కు చెందిన చార్లీ కాసెల్(ఒమన్‌పై ప్రదర్శన) ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, శ్రీలంక బ్యాటర్ చామరి ఆటపట్టు ఉన్నారు.

Similar News

News November 16, 2025

మూడో రోజే ముగిస్తారా?

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజే ముగిసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 200 లోపు స్కోర్లకే ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన సౌతాఫ్రికా 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేవలం 63 పరుగుల లీడ్‌లో ఉంది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో మిగతా 3 వికెట్లు ఫస్ట్ సెషన్‌లోనే పడిపోయే ఛాన్స్ ఉంది.

News November 16, 2025

కార్తీక మాసంలో ఇవి ఆచరించలేదా?

image

కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేస్తారు. అయితే తులసి చుట్టూ ప్రదక్షిణలు, ఉసిరి చెట్టు పూజ, దాని కింద వనభోజనం, శివుడితో పాటు కేశవుడి కథలు కూడా వినడం, దానధర్మాల్లో పాల్గొనడం.. వంటివి కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి చేయకపోతే.. రేపు కార్తీక మాస చివరి సోమవారం రోజున ఆచరించవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో సకల పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం.

News November 16, 2025

అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.