News September 14, 2024

తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!

image

భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 24, 2026

LRS దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్‌కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.

News January 23, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్‌లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

News January 23, 2026

యూనస్‌ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

image

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్‌ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్‌ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.