News March 10, 2025
ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.
Similar News
News December 3, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పట్టనున్న మహార్దశ

రూ.5,000 కోట్లతో NHలు, రూ.4,000 కోట్లతో రైల్వే లైనుతో ఉమ్మడి KNR జిల్లా ప్రయాణికులకు మహార్దశ పట్టనుంది. JGTL-KNR వరకు 58.60 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2484 కోట్లు, JGTL-MNCL వరకు 62.29 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2548 మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇక రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కు రూ.4 వేల కోట్లు మంజూరయ్యాయి. మంథని-కాటారం-మేడారం-తాడ్వాయి-MNGR వరకు రైల్వేప్రయాణం సౌకర్యం ఏర్పడనుంది.
News December 3, 2025
TODAY HEADLINES

⋆ చేనేత, పవర్ లూమ్స్కు ఫ్రీ కరెంట్ : CM CBN
⋆ పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: CM రేవంత్
⋆ పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై TG మంత్రుల ఆగ్రహం.. వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్న జనసేన
⋆ TG: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
⋆ పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్పు
⋆ రెండు దశల్లో జనగణన: కేంద్రం
⋆ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం
News December 3, 2025
చెక్-ఇన్లో టెక్నికల్ గ్లిచ్.. విమానాలు ఆలస్యం

సాంకేతిక సమస్యల వల్ల విమానాల రాకపోకల్లో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఎయిర్పోర్టుల్లోని చెక్-ఇన్ వ్యవస్థలో టెక్నికల్ గ్లిచ్ వల్ల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు పేర్కొంది. చెక్-ఇన్ ప్రాబ్లమ్తో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు బారులుతీరారు. విమానాల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


