News July 4, 2024

నీటి కొరతతో ఆర్థికవ్యవస్థకు ముప్పు!

image

వడ్డీరేట్లు, ఆర్థిక విధానాల కంటే కూడా నీటి కొరత ఆర్థిక వ్యవస్థను ఎక్కువ ప్రభావితం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ‘ఢిల్లీ వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రాజస్థాన్‌లో పలు చోట్ల నాలుగు రోజులకోసారి ట్యాప్ వాటర్ వస్తుంటే, మహారాష్ట్రలో కొన్ని చోట్ల నీటి కోసం 1.5kmపైన వెళ్లాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో నీటి కొరతకు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు దెబ్బతింటాయి’ అని హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 11, 2025

ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

image

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 11, 2025

బంగ్లాదేశ్‌కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్‌కు ముప్పు?

image

బంగ్లాదేశ్‌కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్‌కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్‌మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్‌కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

News December 11, 2025

చలి పంజా.. బయటికి రావద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.