News March 18, 2025
Way2News Exclusive: టెన్త్ విద్యార్థులకు స్కామర్ల వల

AP: ఎలాగైనా టెన్త్ పాస్ కావాలనే విద్యార్థులను కొందరు దోచుకుంటున్నారు. డబ్బులిస్తే జరగబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లు పంపుతామని టెలిగ్రామ్ ఛానళ్లలో వల వేస్తున్నారు. దీంతో అమాయక స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తే ప్రొటెక్టెడ్ PDF పంపి, పాస్వర్డ్ కోసం మళ్లీ డబ్బు లాగుతున్నారు. ఇలాంటి స్కామర్లలో ఒకరితో స్టూడెంట్లా Way2News చాట్ చేసింది (పైన చాట్ ఫొటోలు). విద్యార్థులూ.. ఇలాంటి స్కామర్లను నమ్మకండి.
Share It
Similar News
News April 24, 2025
టెన్త్ ఫెయిలైన వారికి ALERT

AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
News April 24, 2025
మాజీ మంత్రి విడదల రజినీ మరిది అరెస్ట్

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినీతో పాటు గోపీపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
News April 24, 2025
వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు: పాలస్తీనా అధ్యక్షుడు

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.