News May 25, 2024

EVMలకు BJP ట్యాగ్స్ పెట్టారన్న TMC.. స్పందించిన WB CEO

image

EVMలను ట్యాంపర్ చేయాలని BJP యత్నిస్తోందని WB సీఎం మమత నేతృత్వంలోని TMC ఆరోపించింది. రఘునాథ్‌పూర్‌లో 5 EVMలపై BJP ట్యాగ్‌లున్నాయని ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. EC దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే పోలింగ్ ప్రారంభ సమయంలో ట్యాగ్స్‌పై అభ్యర్థులు, ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని, అప్పుడు BJP వాళ్లు మాత్రమే ఉండటంతో వారి సంతకాలు తీసుకున్నామని WB CEO బదులిచ్చింది.

Similar News

News February 10, 2025

బ్యాటింగ్ ఎంజాయ్ చేశా.. సెంచరీపై రోహిత్ కామెంట్

image

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని చెప్పారు. బ్యాటింగ్‌కు దిగినప్పుడే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన బాడీని లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులపై సరైన ప్రణాళికలు అమలు చేశానని పేర్కొన్నారు. ఇక గిల్ చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చారు.

News February 10, 2025

నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

image

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

News February 10, 2025

వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

image

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.

error: Content is protected !!