News March 29, 2024
‘ఫోన్ నంబర్లు మార్చలేక చస్తున్నాం’
TG: రాష్ట్రంలో వలస నేతలతో రాజకీయం హీటెక్కుతోంది. ఈ పరిణామాలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘తెల్లారేసరికి ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఫోన్లో వాళ్ల పేరు వెనుకో ముందో పార్టీ పేరు తగిలించి సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ మార్చలేక చస్తున్నాం’ అని కొందరు, ‘ఒకప్పుడు.. బెల్లం చుట్టూ ఈగలు. ఇప్పుడు.. అధికారం చుట్టూ నేతలు’ అంటూ మరికొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Similar News
News January 14, 2025
నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి
TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News January 14, 2025
క్రేజీ.. మహా కుంభమేళాలో ‘అఖండ-2’ షూట్
సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ పాజిటివ్ సొంతం చేసుకుంది.
News January 14, 2025
నేడు పసుపు బోర్డు ప్రారంభం
TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.