News May 24, 2024

కోచ్ కోసం మేం వారిని సంప్రదించలేదు: జై షా

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం తాము ఏ ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లను సంప్రదించలేదని BCCI సెక్రటరీ జై షా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేశారు. సరైన కోచ్ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. భారత జట్టును మరో లెవెల్‌కు చేర్చే కోచ్‌ను నియమిస్తామని చెప్పారు. కాగా భారత హెడ్ కోచ్ పదవిని పాంటింగ్, లాంగర్, ఆండీ ఫ్లవర్ తదితరులు తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News February 13, 2025

శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

image

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.

News February 13, 2025

మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

error: Content is protected !!