News December 27, 2024
ఇద్దరు మహానుభావులను కోల్పోయాం
మాజీ ప్రధాని, ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన మన్మోహన్ సింగ్ను కోల్పోవడం దేశానికి తీరనిలోటు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించడంతో ఇద్దరు మహానుభావులను కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.
Similar News
News January 25, 2025
జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న
AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.
News January 25, 2025
నేడు VSR రాజీనామా
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.
News January 25, 2025
ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్
2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అతడి అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్ను తాజాగా కొట్టేసింది. దీంతో నేరగాళ్ల ఒప్పందం ప్రకారం త్వరలోనే అమెరికా రాణాను భారత్కు సరెండర్ చేయనుంది. పాకిస్థాన్ ISI, లష్కరే తోయిబాతో సంబంధాలున్న అతడే ముంబై పేలుళ్ల సూత్రధారి అని గతంలో IND ఆధారాలు సమర్పించింది.