News August 6, 2024

వాళ్లనే స్థానికులుగా గుర్తిస్తాం: మంత్రి దామోదర

image

TG: MBBS ప్రవేశాల్లో స్థానికతపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో మంత్రి దామోదర స్పందించారు. 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులను గత ప్రభుత్వ GO ఆధారంగా స్థానికులుగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట 4 ఏళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీతో దీనికి సంబంధించిన గడువు ముగిసిందన్నారు.

Similar News

News November 19, 2025

ఖైదీని మార్చిన పుస్తకం!

image

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.

News November 19, 2025

రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

image

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.

News November 19, 2025

ఖైదీని మార్చిన పుస్తకం!

image

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.