News January 25, 2025

మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి: CBN

image

AP: థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని CM CBN తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన AP బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.

Similar News

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.