News December 8, 2024
యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం: జెలెన్స్కీ
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.
Similar News
News January 21, 2025
ఎంత పని చేశావ్ ట్రంప్ మావా!
USAలో అక్రమంగా ఉంటున్న వారిపైనే ట్రంప్ చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ వచ్చీ రాగానే లీగల్ ఇమ్మిగ్రెంట్స్కూ షాక్ ఇచ్చారు. USAలో పుట్టే పిల్లల పేరంట్స్లో ఒకరికి గ్రీన్ కార్డు/US పౌరసత్వం ఉంటేనే జన్మత: పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎవరైనా USAలో పుట్టగానే అక్కడి పౌరులయ్యేవారు. వారి పేరంట్స్ విదేశీయులైతే, కాస్త ఆలస్యమైనా ఆ కపుల్కు గ్రీన్ కార్డు వచ్చేది. ఇప్పుడిది కష్టమే.
News January 21, 2025
అందుకు బాధగా లేదు: సూర్యకుమార్ యాదవ్
ఛాంపియన్స్ ట్రోపీ 2025కు తనను సెలక్ట్ చేయకపోవడంపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు నాకేం బాధలేదు. నేను గతంలో బాగా ఆడుంటే సెలక్టర్లు కచ్చితంగా సెలక్ట్ చేసేవారు. నాకంటే మెరుగైన ప్రదర్శన చేసిన వారినే జట్టులోకి తీసుకున్నారు. వారి కంటే బాగా రాణించనందుకు బాధపడుతున్నా. CTలో బుమ్రా-షమీ కీలక పాత్ర పోషిస్తారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News January 21, 2025
జాక్ పాట్.. రూ.10 కోట్ల లాటరీ గెలిచిన లారీ డ్రైవర్
పంజాబ్కు చెందిన లారీ డ్రైవర్ జాక్ పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025లో రూప్ నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేకావడం విశేషం. సింగ్ కువైట్లో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెలవులపై తిరిగొచ్చి రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. గత 15 ఏళ్లుగా అతను లాటరీలు కొంటున్నాడు.