News August 23, 2025
సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం.. USకు LPU ఫౌండర్ వార్నింగ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్పై 50% టారిఫ్స్ను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే చండీగఢ్లోని తమ క్యాంపస్లో అమెరికా సాఫ్ట్ డ్రింక్స్, బేవరేజ్ కంపెనీలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీలో 40వేల మంది విద్యార్థులు ఉన్నారని, దేశంలోని అతిపెద్ద వర్సిటీల్లో ఒకటని పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
పెళ్లంటే మరింత అప్పుల్లోకి జారుకోవడమే: టెకీ

నలుగురి మెప్పు కోసం అప్పులు చేసి పెళ్లి చేసుకోవద్దని ఓ టెకీ ఆవేదనతో SMలో చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైకి చెందిన తను, తన బ్రదర్ 4ఏళ్లు కష్టపడి కుటుంబ అప్పుల్ని తీర్చేశారు. రిలాక్స్ అయ్యేలోపే అతడి పేరెంట్స్ పెళ్లికి బంగారం కొనడం, 800మంది అతిథుల్ని పిలుద్దామని చెప్పడంతో రూ.17లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఎలాంటి సేవింగ్స్ చేయలేకపోతున్నానని, ఆడంబరాలకు అప్పులు చేసి ఇబ్బంది పడొద్దని సూచించాడు.
News August 23, 2025
మునిగింది అమరావతి కాదు.. మీ పార్టీ: CBN

AP: ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘మునిగిపోయింది అమరావతి కాదు, మీ పార్టీ. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కలేదని బయట విషం చిమ్ముతున్నారు. చేసిన తప్పును ఇతరులపైకి నెట్టడం వైసీపీ నైజం. అరుంధతి సినిమాలో భూతం మాదిరి ఆ పార్టీ తయారైంది. దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది’ అని సీఎం తెలిపారు.
News August 23, 2025
సల్వాజుడుం తీర్పు నాది కాదు.. సుప్రీంకోర్టుది: సుదర్శన్ రెడ్డి

తాను నక్సలిజాన్ని ప్రోత్సహించానన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై INDI కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి స్పందించారు. సల్వాజుడుంపై తీర్పు వ్యక్తిగతం కాదని, సుప్రీంకోర్టుదని స్పష్టం చేశారు. దీనిపై షాతో వాదనకు దిగనని, చర్చ ఏదైనా పద్ధతిగా జరగాలని హితవు పలికారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతూ అది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య అని వివరించారు.