News October 2, 2024
కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి

AP: కాల్ మనీ దందాపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో ప్రజల్ని వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లే టార్గెట్గా సాగించే వడ్డీ వ్యాపారాలను సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Similar News
News January 2, 2026
చెల్లింపులన్నీ UPIలోనే.. ఏకంగా ₹300 లక్షల కోట్లు

UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు. UPI చరిత్రలో ఇదే అత్యధికం. సగటున రోజుకు 698 మిలియన్ల డిజిటల్ పేమెంట్లు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 228.3B ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹299.7 లక్షల కోట్లు కావడం గమనార్హం. 2024 కంటే సుమారు 33% ఎక్కువ.
News January 2, 2026
ధనుర్మాసం: పద్దెనిమిదో రోజు కీర్తన

‘ఏనుగు వంటి బలమున్న నందగోపుని కోడలా! సుగంధభరిత కేశాలు కల నీళాదేవి! కోళ్లు కూస్తున్నాయి, కోకిలలు గానం చేస్తున్నాయి. నీవు కృష్ణుడితో సరస సంభాషణల్లో మునిగి మమ్మల్ని మరువకు. మీ మధ్య వాదన వస్తే మేము నీ పక్షమే వహిస్తాం. నీ గాజులు ఘల్లుమనేలా నడచి వచ్చి, నీ ఎర్రని తామరల వంటి చేతులతో తలుపులు తీయమ్మా!’ అని వేడుకుంటున్నారు. ఇక్కడ తలుపులు తీయడమంటే భక్తుడికి, భగవంతుడికి మధ్య అడ్డుతెరలను తొలగించడం! <<-se>>#DHANURMASAM<<>>
News January 2, 2026
నా భర్త ముఖంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు: బంగ్లా బాధితురాలు

బంగ్లాదేశ్లోని షరియత్పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే <<18733577>>హిందువుపై<<>> దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. తన భర్తకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు అంత కిరాతకంగా ప్రవర్తించారో తెలియడం లేదని బాధితుడి భార్య సీమా దాస్ వాపోయారు. తన భర్త తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము హిందువులమని, శాంతియుతంగా బతకాలని కోరుకుంటున్నామని చెప్పారు.


