News March 8, 2025

రిలయన్స్ నుంచి Rs24000 CR వసూలు చేస్తాం: కేంద్రమంత్రి

image

రిలయన్స్, దాని భాగస్వాముల నుంచి $2.81B (Rs.24000CR) వసూలు చేస్తామని PNG మంత్రి హర్దీప్‌సింగ్ పూరి అన్నారు. ప్రభుత్వానికి అన్ని హక్కులూ ఉన్నాయని కోర్టు చెప్పినట్టు గుర్తుచేశారు. ‘కోర్టు తీర్పు సుస్పష్టం. మేమిప్పటికే డబ్బు కోసం నోటీసులు పంపించాం. మా హక్కును వాడుకుంటాం’ అని తెలిపారు. హక్కుల్లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్‌ను వెలికితీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు RILకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

Similar News

News January 18, 2026

హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

image

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.

News January 18, 2026

రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స

image

AP: రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ వర్గానికీ సంక్రాంతి సంతోషం లేదన్నారు. పండగ ముందే మద్యం ధరలు, భూముల విలువలు పెరిగాయని విమర్శించారు. ‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. యూరియా ఇప్పటికీ అధిక ధరకే అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కింది. గ్రామ బహిష్కరణలు, శాంతిభద్రతల లోపాలపై ప్రధాని మోదీ స్పందించాలి’ అని కోరారు.

News January 18, 2026

నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

image

వరుస ఫెయిల్యూర్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.