News March 8, 2025
రిలయన్స్ నుంచి Rs24000 CR వసూలు చేస్తాం: కేంద్రమంత్రి

రిలయన్స్, దాని భాగస్వాముల నుంచి $2.81B (Rs.24000CR) వసూలు చేస్తామని PNG మంత్రి హర్దీప్సింగ్ పూరి అన్నారు. ప్రభుత్వానికి అన్ని హక్కులూ ఉన్నాయని కోర్టు చెప్పినట్టు గుర్తుచేశారు. ‘కోర్టు తీర్పు సుస్పష్టం. మేమిప్పటికే డబ్బు కోసం నోటీసులు పంపించాం. మా హక్కును వాడుకుంటాం’ అని తెలిపారు. హక్కుల్లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్ను వెలికితీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు RILకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
Similar News
News December 6, 2025
మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.
News December 6, 2025
ECIL హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని<
News December 6, 2025
నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.


