News March 29, 2024
కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం: KTR
TG: వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంపై కేటీఆర్ స్పందించారు. ‘అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి మన కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన KCRను, BRSను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 24, 2025
త్వరలో RTCలో నియామకాలు: మంత్రి
TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
News January 24, 2025
ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల
AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.
News January 24, 2025
Stock Markets: ఓపెనింగ్కు సానుకూల సంకేతాలు..
స్టాక్మార్కెట్లు పాజిటివ్గా మొదలవ్వొచ్చు. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. గిఫ్ట్నిఫ్టీ 45PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ బాండు యీల్డుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఐటీ సహా మేజర్ కంపెనీల నుంచి మద్దతు లభిస్తే నిఫ్టీ 23,200 పైస్థాయిలో నిలదొక్కుకోవచ్చు. నేడు JSW Steel, HPCL, BOI, DLF, AUSFB, FED BANK, LAURUS LAB, SRIRAM FIN ఫలితాలు విడుదలవుతాయి.