News January 16, 2025

సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN

image

AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.

Similar News

News December 5, 2025

IndiGo సంక్షోభం.. బాధ్యత ఎవరిది?

image

కొత్త FDTL (Flight Duty Time Limitations) నిబంధనల అమలుతో <<18479258>>IndiGo<<>> తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పైలట్లకు వారానికి 48 గంటల రెస్ట్‌తో పాటు ఇతర పరిమితులతో సిబ్బంది కొరత తలెత్తింది. DGCA 18 నెలల గడువు ఇచ్చినా సంస్థ సిబ్బందిని నియమించుకోలేదని పైలట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం నియమాలు తీసుకువచ్చిందని.. విమానాల రద్దు, ఆలస్యానికి ప్రణాళిక లోపమే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

News December 5, 2025

డెలివరీ టైంలో ట్యూబెక్టమీ చేయించుకోవచ్చా?

image

చాలామంది మహిళలు డెలివరీ సమయంలో విశ్రాంతి, ఆస్పత్రి ఖర్చులు కలిసి వస్తాయని ట్యూబెక్టమీ చేయించుకోవాలనుకుంటారు. కానీ సిజేరియన్‌తోపాటు ట్యూబెక్టమీ ఆపరేషన్​ చేసినపుడు అది ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాన్పు తర్వాత సంవత్సరం ఆగి, టీకాలన్నీ పూర్తయి, బిడ్డకు ఎలాంటి లోపాలూ లేవని, ఆరోగ్యం అంతా బాగుందని నిర్ధారించుకుని, అప్పుడు ట్యూబెక్టమీ చేయించుకుంటే మంచిది.

News December 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 87 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: అర్జునుడు అజ్ఞాతవాసంలో బృహన్నల రూపాన్ని ఎందుకు ధరించడు?
జవాబు: ఊర్వశి ప్రేమను అర్జునుడు ఓనాడు తిరస్కరించాడు. దీంతో కోపించిన ఊర్వశి, అర్జునుడిని నపుంసకుడిగా మారుతావని శపించింది. అయితే ఇంద్రుడి విన్నపంతో ఊర్వశి ఆ శాపాన్ని సడలించింది. అర్జునుడు కోరినప్పుడు ఏడాది పాటు మాత్రమే ఆ శాపం పనిచేసేలా చేసింది. ఈ శాపాన్నే అర్జునుడు తమ అజ్ఞాతవాసానికి అనుకూలంగా మార్చుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>