News January 16, 2025
సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN

AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.
Similar News
News February 16, 2025
పూరీ-గోపీచంద్ కాంబోలో మూవీ?

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త మూవీపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశారు. ఇటీవలే హీరో గోపీచంద్కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా గోపీచంద్ చివరి 3 చిత్రాలు(రామబాణం, భీమా, విశ్వం) బాక్సాఫీస్ను మెప్పించలేకపోయాయి.
News February 16, 2025
IPL-2025 క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ ఎక్కడంటే?

IPL-2025లో కీలక మ్యాచ్లకు HYD, కోల్కతా వేదికలు కానున్నాయి. క్వాలిఫయర్-1 మే 20న, ఎలిమినేటర్ మే 21న HYDలో జరగనున్నాయి. క్వాలిఫయర్-2 మే 23న, ఫైనల్ మే 25న కోల్కతాలో నిర్వహించనున్నారు. క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన టీంకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది.
News February 16, 2025
18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్ఫామ్పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.