News January 30, 2025
గెలవగానే టీడీపీ భరతం పడతాం: పెద్దిరెడ్డి

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం రాగానే టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని, దాడులకు ప్రతిదాడులు కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. తాము గెలవగానే తడాఖా చూపిస్తామన్నారు. కడప, రాయచోటి వైసీపీ సమన్వయ సభల్లో పెద్దిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
Similar News
News November 2, 2025
పసుపుతో అందమైన పెదాలు

ముఖ సౌందర్యంలో పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేచురల్గా అందంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించండి. * పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. * చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి.
News November 2, 2025
విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్తో పోలిస్తే 8.77శాతం వృద్ధి


