News February 4, 2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం: CM

TG: బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి BRS, BJPలకు సవాల్ విసిరారు. ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని BRS, BJPకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు.
Similar News
News February 16, 2025
హార్ట్ బ్రేకింగ్ PHOTO.. చిట్టితల్లికి ఎంత కష్టమో!

రూ.లక్షల కోట్ల బడ్జెట్. కోట్లాది మంది ఉద్యోగులు, పోలీసులు. లేటెస్ట్ టెక్నాలజీ. అయినా మన దేశంలో సాధారణ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు. నిన్న ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత సగటు భారతీయుడి ఆవేదన ఇది. కాలు పెట్టేందుకు కూడా చోటు లేని రైల్లో తన కూతురిని జాగ్రత్తగా ఎత్తుకున్న తండ్రి ఫొటో చూస్తే గుండెలు బరువెక్కుతున్నాయి. ఆ రద్దీ, తోపులాటకు తాళలేక ఆ పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది.
News February 16, 2025
రేవంత్ ఢిల్లీకి వెళ్లేది అందుకే : కిషన్ రెడ్డి

TG: దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
News February 16, 2025
చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.