News June 19, 2024
ఆ సిటీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్

కర్ణాటక హుబ్బళ్లిలోని డెవలప్మెంట్ సెంటర్లో పని చేసేందకు ఉద్యోగులు ఆసక్తి చూపించకపోవడంతో వారికి ఇన్ఫోసిస్ ఆఫర్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చి పనిచేస్తే ₹8లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. కనిష్ఠంగా బ్యాండ్-3 అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు రెండేళ్లలో రూ.1.25లక్షల ప్రోత్సాహకం ఇస్తామంది. ఇక బ్యాండ్ 4- ₹2.5లక్షలు, బ్యాండ్ 5- ₹5లక్షలు, బ్యాండ్ 6- ₹8లక్షల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.
Similar News
News March 31, 2026
భారత్ తొలి మహిళా డాక్టర్.. ఎందరికో స్ఫూర్తి!

పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్.ఆనందీబాయి జోషి. 1865 MAR 31న మహారాష్ట్రలో జన్మించిన ఈమెకు తొమ్మిదేళ్లకే వివాహమైంది. 14ఏళ్ల వయసులో కొడుకు పుట్టగా సరైన వైద్య సౌకర్యాలు లేక పది రోజులకే చనిపోయాడు. మహిళా డాక్టర్ల అవసరాన్ని గ్రహించిన ఆమె మెడిసిన్ చదివేందుకు సిద్ధపడ్డారు. భర్త ప్రోత్సాహంతో సమాజాన్ని ఎదిరించి అమెరికా వెళ్లారు. 1886లో పట్టా పొంది భారత్ తిరిగొచ్చారు.
News March 31, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ₹100కోట్ల మార్క్ చేరుతుందా?

బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంద కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఉగాదికి (మార్చి 19) రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹94.38కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక భారత్లో ఈ మూవీ నెట్ కలెక్షన్లు ₹70.29Crకు చేరాయి. రోజు రోజుకూ ఆక్యుపెన్సీ తగ్గుతుండటంతో ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
News March 31, 2026
కరెంట్ అఫైర్స్

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం


