News February 17, 2025

స్కూళ్ల కోసం రూ.2000 కోట్లు ఇస్తాం: అదానీ గ్రూప్

image

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్‌మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.

Similar News

News January 8, 2026

ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలంటే..?

image

ఇంటి వాస్తులో కిటికీలు కీలకమని, వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీలు సరి సంఖ్యలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘తూర్పు, ఉత్తర దిశల్లో కిటికీలు ఉండటం వల్ల సానుకూల శక్తి, ఆరోగ్యం చేకూరుతాయి. కిటికీలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పగిలిన అద్దాలు, శబ్దం చేసే తలుపులు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. పగటిపూట కిటికీలు తెరిచి ఉంచితే వెలుతురుతో పాటు ప్రశాంతత లభిస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 8, 2026

కోహ్లీ పేరు ఎత్తకుంటే వారికి ఇల్లు గడవదు: వికాస్ కోహ్లీ

image

కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఫైరయ్యారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి <<18780306>>ఈజీ ఫార్మాట్‌<<>>లో కోహ్లీ కొనసాగుతున్నారని చేసిన విమర్శలకు పరోక్షంగా కౌంటరిచ్చారు. ‘విరాట్ పేరు ఎత్తకుంటే కొందరికి ఇల్లు గడవదు’ అనే అర్థం వచ్చేలా SMలో రాసుకొచ్చారు. గతంలో విరాట్ స్ట్రైక్ రేట్‌ను మంజ్రేకర్ విమర్శించగా, ‘మంజ్రేకర్ కెరియర్‌లో ODI స్ట్రైక్ రేట్ 64.30’ అని వికాస్ సెటైర్ వేశారు.

News January 8, 2026

ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ ‘రాజాసాబ్’!

image

TG: ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ప్రీమియర్స్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్‌ను అడుగుతున్నారు. కాగా మరికాసేపట్లో రాజాసాబ్ ప్రీమియర్లపై జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.