News February 17, 2025

స్కూళ్ల కోసం రూ.2000 కోట్లు ఇస్తాం: అదానీ గ్రూప్

image

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్‌మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.

Similar News

News March 27, 2025

డైలీ ట్రాన్జాక్షన్లకు UPI, భారీ ఖర్చులకు క్రెడిట్‌కార్డు

image

డైలీ ట్రాన్జాక్షన్ల కోసం UPIను అత్యధికంగా వినియోగిస్తున్న యువత భారీ కొనుగోళ్లకు మాత్రం క్రెడిట్ కార్డును వాడేందుకే ఇష్టపడుతోందని కివీ, అనోమర్ సర్వే తెలిపింది. నెల రోజులు వడ్డీలేని సులభ రుణం దొరకడం, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు అలాగే ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈజీ యాక్సెస్, భారీ రీచ్ వల్ల 70% యువ కస్టమర్లు రోజువారీ ఖర్చులకు, 81% మంది వ్యక్తిగత లావాదేవీలకు UPIని వాడుతున్నారని పేర్కొంది.

News March 27, 2025

పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.

News March 27, 2025

ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

error: Content is protected !!