News June 18, 2024
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీని నంబర్-1 చేస్తాం: సత్యకుమార్ యాదవ్

AP: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు తిరోగమించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ధర్మవరంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని నంబర్-1 చేస్తామని తెలిపారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.
Similar News
News March 15, 2026
నేడే ఎన్నికల షెడ్యూల్.. 4 గం.కు ప్రెస్ మీట్

4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉందని ANI తెలిపింది. సా.4 గం.కు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుందని పేర్కొంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించింది.
News March 15, 2026
సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ దూరం?

The Hundred టోర్నీ కోసం అబ్రార్(పాక్)ను సన్రైజర్స్ లీడ్స్ కొనడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లీగ్ జులై 21-AUG 16 వరకు కొనసాగనుండగా అదే సమయంలో పాక్ టీమ్ 2 టెస్టుల సిరీస్ కోసం విండీస్లో పర్యటించనుంది. అందువల్ల అబ్రార్కు పాక్ NOC ఇవ్వకపోవచ్చని, టోర్నీలో ఆడటం అనుమానమేనని సమాచారం. కాగా అతను టోర్నీకి అందుబాటులో ఉంటాడనే కొనుగోలు చేశామని SRH హెడ్ కోచ్ వెటోరీ చెప్పిన విషయం <<19370720>>తెలిసిందే.<<>>
News March 15, 2026
అటామిక్ క్లాక్స్ చెడిపోతే ఏం జరుగుతుంది?

నేవిగేషన్ వ్యవస్థలో అటామిక్ క్లాక్స్(పరమాణు గడియారాలు) కీలకం. భూమిపై ఉన్న మనిషి/ప్రదేశం/ వస్తువు స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఇవే ఆధారం. ఇవి 15 బిలియన్ ఏళ్లలో ఒక్క సెకను కూడా తప్పు చూపవు. ప్రస్తుతం నావిక్ వ్యవస్థలోని <<19386461>>ఈ క్లాక్<<>> చెడిపోయింది. దీనివల్ల ఏదైనా వస్తువు అసలు స్థానం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతాయి. నావిక్తో అనుసంధానమైన 8,700 రైళ్లకు అంతరాయం ఏర్పడవచ్చు.


