News March 28, 2024
అగ్నివీర్ స్కీమ్లో అవసరమైతే మార్పులు చేస్తాం: రాజ్నాథ్

భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్ల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.
Similar News
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.
News December 1, 2025
25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://ssc.gov.in
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.


