News March 28, 2024
అగ్నివీర్ స్కీమ్లో అవసరమైతే మార్పులు చేస్తాం: రాజ్నాథ్
భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్ల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.
Similar News
News January 24, 2025
త్వరలో RTCలో నియామకాలు: మంత్రి
TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
News January 24, 2025
ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల
AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.
News January 24, 2025
Stock Markets: ఓపెనింగ్కు సానుకూల సంకేతాలు..
స్టాక్మార్కెట్లు పాజిటివ్గా మొదలవ్వొచ్చు. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. గిఫ్ట్నిఫ్టీ 45PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ బాండు యీల్డుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఐటీ సహా మేజర్ కంపెనీల నుంచి మద్దతు లభిస్తే నిఫ్టీ 23,200 పైస్థాయిలో నిలదొక్కుకోవచ్చు. నేడు JSW Steel, HPCL, BOI, DLF, AUSFB, FED BANK, LAURUS LAB, SRIRAM FIN ఫలితాలు విడుదలవుతాయి.