News December 25, 2024

రేపు సీఎం రేవంత్‌ను కలుస్తాం: దిల్ రాజు

image

టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి రేపు సీఎం రేవంత్‌ను కలుస్తామని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. అల్లు అరవింద్‌తోపాటు వెళ్లి కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి రూ.2కోట్లు రేవతి కుటుంబానికి అందిస్తున్నారు’ అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Similar News

News December 9, 2025

ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

image

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్‌స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ప్రవర్తించాలన్నారు.

News December 9, 2025

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అసిమ్‌ మునీర్

image

పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా నియమితులైన అసిమ్‌ మునీర్ మరోసారి భారత్‌ లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే పాక్ ప్రతిస్పందన ఈసారి మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అణుబాంబు బెదిరింపులు సహా గతంలో కూడా <<18043029>>మునీర్‌<<>> ఇలాంటి కామెంట్స్ చేశారు.

News December 9, 2025

గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.