News December 25, 2024

రేపు సీఎం రేవంత్‌ను కలుస్తాం: దిల్ రాజు

image

టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి రేపు సీఎం రేవంత్‌ను కలుస్తామని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. అల్లు అరవింద్‌తోపాటు వెళ్లి కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి రూ.2కోట్లు రేవతి కుటుంబానికి అందిస్తున్నారు’ అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Similar News

News November 10, 2025

క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

image

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.

News November 10, 2025

లైంగిక వేధింపులు ఎదురైతే..

image

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.

News November 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 62 సమాధానాలు

image

ప్రశ్న: శిఖండి ఎవరు? ఆమె భీష్ముడి చావునెందుకు కోరింది?
జవాబు: శిఖండి పూర్వజన్మలో కాశీ రాజకుమారి అంబ. ఆమె ఒకర్ని ప్రేమించి, వివాహం చేసుకోవాలి అనుకోగా.. భీష్ముడు బలవంతంగా తనను తీసుకెళ్లి వేరొకరికిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ప్రతిజ్ఞ పూనిన అంబ మరుజన్మలో శిఖండిగా పుట్టి, యుద్ధంలో పాల్గొని, భీష్ముని చావుకు కారణమైంది.
☞ సరైన సమాధానం చెప్పినవారు: కృష్ణ, నల్గొండ.
<<-se>>#Ithihasaluquiz<<>>