News April 6, 2025

తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

image

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Similar News

News April 20, 2025

భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

image

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం

News April 20, 2025

PHOTOS: స్టైలిష్‌ లుక్‌లో Jr.NTR

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కోసం Jr.NTR బయల్దేరినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేనితో ఆయన ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తారక్ కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈనెల 22 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. అయితే షూటింగ్ ఎక్కడ జరగనుంది? హీరో ఎక్కడికి బయల్దేరారనే విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించలేదు.

News April 20, 2025

‘గ్లోబల్ మీడియా డైలాగ్‌’కు మోదీ సారథ్యం

image

ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్‌’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్(M&E) రంగాల క్రియేటర్స్‌ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్‌లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

error: Content is protected !!