News January 12, 2025
వారికి రైతు భరోసా ఇవ్వం: మంత్రి పొంగులేటి

TG: రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకులోను కావొద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు.
Similar News
News February 15, 2025
నేటి నుంచి CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్స్

నేటి నుంచి దేశవ్యాప్తంగా CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉ.10.30 నుంచి మ.1.30 గం. వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫాం తప్పనిసరి. మార్చి 18న టెన్త్, ఏప్రిల్ 4న 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ముగుస్తాయి.
News February 15, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. ఇవాళ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.
News February 15, 2025
బైక్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

*రోడ్లపై స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి
*ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు
*స్లోగా వెళ్లేవారు ఎడమవైపు వెళ్లాలి. కుడి వైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
*ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి లో క్వాలిటీ హెల్మెట్లు వాడతారు. వీటి వల్ల మన ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. అందుకే ISI మార్క్ ఉన్న క్వాలిటీ హెల్మెట్ వాడాలి.
*బైక్ నడుపుతూ సెల్ ఫోన్ వాడొద్దు.
*రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దు.