News September 27, 2024

ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకూ విశ్రమించం: అమిత్ షా

image

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేశారు. వారు ఉగ్రవాదాన్ని వదలకపోతే భారత జవాన్ల చేతిలో చావు తప్పదని ఎన్నికల సభలో హెచ్చరించారు. ‘జమ్మూకశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్కడ అలజడి సృష్టించేందుకు యత్నించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కే వరకూ విశ్రమించం. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్, ఎన్‌సీ ఉగ్రవాదాన్ని పోషించాయి’ అని విమర్శించారు.

Similar News

News November 16, 2025

ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

image

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

News November 16, 2025

Infosys ఉద్యోగులకు 75% బోనస్‌

image

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్‌స్టాండింగ్‌ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్‌ 4, 5, 6లోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.

News November 16, 2025

ఇండియా-A ఘన విజయం

image

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.