News September 17, 2024
‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తాం: సీఎం

AP: విజయవాడలో మళ్లీ వరదలు రాకుండా ‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలను క్లియర్ చేస్తే 95% సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి చట్టం తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News October 16, 2025
స్థానిక ఎన్నికలు.. ఇవాళ ఏం జరగనుంది?

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. SC ఇవాళే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? లేక విచారణను వాయిదా వేస్తుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు స్టేతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అనుకూలంగా SC నిర్ణయం ప్రకటిస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
News October 16, 2025
ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.
News October 16, 2025
టీచర్లకు టెట్.. ప్రభుత్వం సమాలోచనలు!

AP: టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని SEP 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపైనా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కాగా 2011కు ముందు టెట్ లేదు.