News April 25, 2024
అధికారంలోకి రాగానే అతడిని ఆదుకుంటాం: నారా లోకేశ్
AP: సీఎం జగన్పై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. తప్పుడు కేసు ఎదుర్కొంటున్న సతీశ్ను, అతని కుటుంబాన్ని అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ట్వీట్ చేశారు. ఈ కేసును ఎత్తివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారందరినీ ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News January 14, 2025
లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు
లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.
News January 14, 2025
పాకిస్థాన్కు రోహిత్ శర్మ?
<<14970733>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> ప్రారంభానికి ముందు IND కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్కు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ICC టోర్నీల ప్రారంభానికి ముందు హోస్ట్ నేషన్లో అన్ని జట్ల కెప్టెన్లు ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. ఈసారి CTని పాక్ హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి రోహిత్ వెళ్తారా? లేదా ఫొటో షూట్ను వేరే చోట నిర్వహిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
News January 14, 2025
కొత్త రైలు ఇంజిన్తో ప్రపంచాన్ని స్టన్చేసిన భారత్!
భారత్ మరో అద్భుతం చేసింది. US సహా ప్రపంచాన్ని స్టన్ చేసింది. తొలిసారిగా 1200 హార్స్పవర్తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమూ 500-600HPS మధ్యే ఉంటుంది. భారత్ మాత్రం 1200HPS, 140KMSతో అబ్బురపరిచింది. వీటికి డీజిల్, కరెంటు అవసరం లేదు. కాలుష్యం వెలువడదు.