News May 4, 2024
వ్యయ పరిమితి దాటితే చర్యలు ఎలా?

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 20, 2025
ఐదేళ్లలో ₹1.42 కోట్లు సేవ్ చేసిన చైనా డెలివరీ బాయ్

చైనాకు చెందిన 25 ఏళ్ల ఫుడ్ డెలివరీ బాయ్ జాంగ్ ఐదేళ్లలో ఏకంగా ₹1.42 కోట్లు సేవ్ చేశాడు. గతంలో వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చడమే లక్ష్యంగా రోజుకు 13 గంటలు కష్టపడ్డాడు. తిండి, నిద్రకు మాత్రమే విరామం తీసుకునేవాడు. కనీస అవసరాలకు తప్ప దుబారా చేయలేదు. నెలకు 300 ఆర్డర్లు కంప్లీట్ చేస్తూ దాదాపు 3.24 లక్షల కి.మీ కవర్ చేశాడు. ఈ సేవింగ్స్తో మళ్లీ సొంతంగా బిజినెస్ చేస్తానంటున్నాడు ఈ ‘ఆర్డర్ కింగ్’.
News December 20, 2025
ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్మార్ట్ చదువులతో పాటు స్వచ్ఛమైన గాలిని’ పీల్చుకోవాలనే లక్ష్యంతో ‘బ్రీత్ స్మార్ట్’ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా మొదటి దశలో 10వేల తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. నగరంలోని 1,047 ప్రభుత్వ పాఠశాలల్లో 38వేల గదులకు విస్తరిస్తామన్నారు.
News December 20, 2025
పిల్లలకు ఇంటి పనులు నేర్పిస్తున్నారా?

పిల్లలు బాగా చదవాలని చాలామంది పేరెంట్స్ ఇంట్లో పనులకు దూరంగా ఉంచుతారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. చదువుతో పాటు ఇంటి పనులు నేర్పిస్తేనే వారికి బాధ్యత పెరుగుతుందంటున్నారు. లేదంటే ఇంటికి దూరంగా ఉండాల్సినపుడు పిల్లలు ఇబ్బంది పడతారని సూచిస్తున్నారు. బట్టలు మడతపెట్టడం, సర్దడం, ఇల్లు ఊడవడం, తల్లిదండ్రుల పనుల్లో సాయం చేయడం వంటి చిన్న చిన్న పనులు నేర్పించడం ముఖ్యమంటున్నారు.


