News May 4, 2024

వ్యయ పరిమితి దాటితే చర్యలు ఎలా?

image

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్‌సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 15, 2025

45ఏళ్లలోపు వారికి గుండెపోటు ప్రమాదం.. కారణాలివే!

image

ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 45 ఏళ్లలోపు వారిలో సంభవించే ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని IJMR <<18568129>>నివేదిక<<>> హెచ్చరించింది. ఒత్తిడి, జీవనశైలి, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు యువత గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. యువత తమ జీవనశైలిని మార్చుకోవాలని, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT

News December 15, 2025

‘ఉపాధి హామీ’ చట్టం రద్దుకు కేంద్రం బిల్లు!

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) కేంద్రం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) పేరుతో కొత్త చట్టం తీసుకురానుంది. ఇవాళ లోక్‌సభలో సభ్యులకు బిల్లు పేపర్లను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద నైపుణ్యం లేని కార్మికులకు పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచనుంది.

News December 15, 2025

లోయలో పడిన స్కూల్ బస్సు.. 17 మంది మృతి

image

కొలంబియాలోని ఆంటియోక్వియాలో ఘోర ప్రమాదం జరిగింది. టూర్ నుంచి వస్తున్న స్కూల్ బస్సు లోయలో పడటంతో 17 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది 16-18 ఏళ్లలోపు పిల్లలేనని అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలు చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ వెల్లడించారు.