News December 13, 2024
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అల్లు అర్జున్ ఏం చెప్పారంటే?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదని పోలీసులకు అల్లు అర్జున్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లకు రావడం సహజమేనని, గతంలో కూడా ఇలా వచ్చినట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని, తాను రావడం వల్లే ఘటన జరిగిందనేది అవాస్తవమని చెప్పినట్లు సమాచారం.
Similar News
News July 5, 2025
వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.
News July 5, 2025
ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)
News July 5, 2025
భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.