News April 27, 2024
రాహుల్ గురించి ‘అమేథీ’ ఏమనుకుంటోంది? – 2/2

రాహుల్ గాంధీ మరోసారి అమేథీలో పోటీ చేయడంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోందని ఓ సంస్థ సర్వేలో తేలింది. కొందరు రాహుల్ మరోసారి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాహుల్ రీఎంట్రీపై ఆసక్తి చూపనట్లు సమాచారం. మూడు టర్మ్లలో రాహుల్ ఏమీ చేయలేదని కొందరంటే, సరైన నిర్ణయం తీసుకోలేని వారికి ఓటు వేయొద్దని మరికొందరు పేర్కొనడం గమనార్హం. <<-se>>#Elections2024<<>>
Similar News
News February 10, 2026
NGKL: మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ పై నిషేధం

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరు కూడా పత్రిక ప్రకటనలు చేయరాదని సూచించారు. నాయకులు పత్రికా సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన అధికారులు మాత్రమే మాట్లాడాలని అన్నారు.
News February 10, 2026
HYD ఉద్యోగులకు గుడ్న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

కొత్త ఇన్కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
News February 10, 2026
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.


