News November 9, 2024

కందిపప్పు తూకం తక్కువుందని పోస్టు పెడితే కేసా?: వైసీపీ

image

AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్‌రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.

Similar News

News December 12, 2025

భారత్ భారీ స్కోర్

image

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.

News December 12, 2025

హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

image

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.

News December 12, 2025

OTTలోకి రెండు కొత్త సినిమాలు

image

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ’12A రైల్వే కాలనీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. అటు దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా NOV 14న విడుదలవగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది.