News November 9, 2024
కందిపప్పు తూకం తక్కువుందని పోస్టు పెడితే కేసా?: వైసీపీ

AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News October 20, 2025
దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.
News October 20, 2025
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.