News November 9, 2024

కందిపప్పు తూకం తక్కువుందని పోస్టు పెడితే కేసా?: వైసీపీ

image

AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్‌రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.

Similar News

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News December 17, 2025

ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.