News November 9, 2024

కందిపప్పు తూకం తక్కువుందని పోస్టు పెడితే కేసా?: వైసీపీ

image

AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్‌రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.

Similar News

News November 15, 2025

IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

image

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.

News November 15, 2025

బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

image

TG: కూకట్‌పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్‌లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్‌వర్డులు సంపాదించారు. వందల హార్డ్‌డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

News November 15, 2025

పేలుడు పదార్థాల్లో రసాయనిక చర్యతోనే భారీ బ్లాస్టింగ్!

image

J&K నౌగామ్ పోలీసు స్టేషన్లో భారీ బ్లాస్టింగ్‌ ఉగ్రదాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఫరీదాబాద్‌(హరియాణా)లో వైట్‌కాలర్ టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న360 KGల కెమికల్ పేలుడు పదార్థాల్లో అత్యధిక భాగం ఈ PSలోనే ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి నుంచి శాంపిల్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు PTI పేర్కొంది. ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. PS తునాతునకలైంది.