News August 28, 2024
‘రైట్ టు డిస్కనెక్ట్’ మన దగ్గరుంటే ఎలా ఉంటుంది?

ఆస్ట్రేలియాలో ఈ ‘రైట్ టు డిస్కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. యూరప్, అమెరికా వంటి 20కి పైగా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. దీని ప్రకారం ఆఫీస్ పని వేళలు ముగిశాక బాస్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. ఇది తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు ఉపయోగపడుతుందని ఆ ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు విశ్రాంతి ఇస్తే వారికి సిక్ లీవ్స్ అవసరమూ తగ్గుతుందని మరికొందరు అంటున్నారు.
Similar News
News October 11, 2025
ట్రయల్ ఖైదీలు ఓటు వేయకూడదా: SC ప్రశ్న

అండర్ ట్రయల్ ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో PIL దాఖలైంది. దీన్ని విచారించిన SC కేంద్రం, ఎన్నికల కమిషన్ల స్పందన కోరింది. ‘కోర్టులో నేర నిరూపణ జరగనంత వరకూ నిర్దోషే’ అనే న్యాయసూత్రం ప్రకారం విచారణ కేసుల్లో జైళ్లలో గల వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని పిటిషనర్ కోరారు. 2023 లెక్కల ప్రకారం దేశంలోని జైళ్లలో గల 5.3 లక్షల ఖైదీల్లో 3.9 లక్షల మంది కేసుల విచారణ ఎదుర్కొంటున్నవారే.
News October 11, 2025
భారత్ 518/5 డిక్లేర్

WIతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో టీమ్ ఇండియా 518/5 రన్స్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ (175), గిల్ (129*) సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ 38, సాయి సుదర్శన్ 87, నితీశ్ కుమార్ రెడ్డి 43, జురెల్ 44 రన్స్ చేశారు.
News October 11, 2025
WBలో మరో MBBS విద్యార్థినిపై అత్యాచారం

బెంగాల్లో మరో మెడికల్ స్టూడెంట్ రేప్కు గురైంది. ఒడిశాకు చెందిన ఆమె శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. మిత్రుడితో కలిసి నిన్న 8.30PMకు తినేందుకు బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. డాక్టర్గా చూడాలని ఎన్నో ఆశలతో కుమార్తెను చదివిస్తున్నామని ఆమె తండ్రి రోదించారు. కోల్కతా ఆర్జీకర్ రేప్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు రేగడం తెలిసిందే.