News August 28, 2024
‘రైట్ టు డిస్కనెక్ట్’ మన దగ్గరుంటే ఎలా ఉంటుంది?

ఆస్ట్రేలియాలో ఈ ‘రైట్ టు డిస్కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. యూరప్, అమెరికా వంటి 20కి పైగా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. దీని ప్రకారం ఆఫీస్ పని వేళలు ముగిశాక బాస్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. ఇది తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు ఉపయోగపడుతుందని ఆ ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు విశ్రాంతి ఇస్తే వారికి సిక్ లీవ్స్ అవసరమూ తగ్గుతుందని మరికొందరు అంటున్నారు.
Similar News
News November 21, 2025
ట్రై సిటీలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ట్రై సిటీ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
News November 21, 2025
ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.
News November 21, 2025
23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.


