News November 12, 2024
కలెక్టర్పై దాడి చేయడమేంటి?

జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 14, 2025
ఈ నెల 20న కొత్త సర్పంచ్లకు బాధ్యతలు

TG: పంచాయతీ ఎలక్షన్స్లో ఎన్నికైన కొత్త సర్పంచ్లు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణం స్వీకారం చేసేలా అపాయింట్మెంట్ డేను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ గెజిట్ జారీ చేసింది. ఆ రోజు నుంచి 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచ్లు బాధ్యతలు చేపట్టాక పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరనుంది.
News December 14, 2025
జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

AP: రాష్ట్రంలో పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే జనవరి 2 నుంచి 11 రోజులపాటు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 36వ బుక్ ఫెస్టివల్ జరగనుంది. రోజూ 6PMకు సందర్శన మొదలవుతుంది. లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. డైలీ సాహిత్య సదస్సులు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. కార్యక్రమ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ను నిర్వాహకులు ఆహ్వానించారు. తాజాగా పుస్తక ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు.
News December 14, 2025
ఆదివారం ఏం కొనాలి? ఏం కొనకూడదు?

ఆదివారం ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి, ఇనుము, ఫర్నిచర్, హార్డ్వేర్, వాహన వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టానికి, పేదరికానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కంటికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, రాగి, ఎరుపు రంగు వస్తువులు కొనడం మాత్రం శుభప్రదమని అంటున్నారు. ఇది ఆర్థిక ఎదుగుదలకు, సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుందని వివరిస్తున్నారు.


