News November 12, 2024
కలెక్టర్పై దాడి చేయడమేంటి?

జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 36

సంకట హటై మిటై సబ పీరా|
జో సుమిరై హనుమత బలవీరా||
శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అయిన హనుమంతుడిని ఎవరైతే భక్తితో స్మరించుకుంటారో, వారికి కలిగే అన్ని రకాల సంకటాలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. వారిని పీడిస్తున్న బాధలు, దుఃఖాలు కూడా పూర్తిగా చెరిగిపోతాయి. హనుమంతుడి స్మరణ అనేది భక్తులకు బలం, ధైర్యం, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 12, 2025
ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

పశ్చిమ బెంగాల్లోని ఎయిమ్స్ కల్యాణిలో 172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD,DNB,DM,MCH, MSc,M.biotech,M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: https://aiimskalyani.edu.in/
News December 12, 2025
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

టాలీవుడ్ <<18541857>>నటులు<<>> వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కోర్టులకు కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే?.. కాపీరైట్, IT, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయ స్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, అనేక టెక్ దిగ్గజాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి. ఢిల్లీ HC ఉత్తర్వులు దేశం మొత్తం వర్తిస్తాయని దీన్ని ఆశ్రయిస్తుంటారు.


