News December 1, 2024
కిషన్రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం?: CM రేవంత్

TG: కేంద్రమంత్రి <<14761412>>కిషన్రెడ్డికి<<>> తెలంగాణతో ఏం సంబంధం అని CM రేవంత్ ప్రశ్నించారు. ‘ఆయనకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉంది? గుజరాత్లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా? BJP గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం’ అని రేవంత్ సవాల్ విసిరారు.
Similar News
News November 8, 2025
కీరాతో ఎన్నో లాభాలు

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.
News November 8, 2025
జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.
News November 8, 2025
60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్పై ముందుగా దిన్కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది.


