News February 16, 2025
మోదీ కులంపై ఏంటీ వివాదం? రేవంత్ చెప్పింది నిజమేనా?

గుజరాత్కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీది ‘మోద్ ఘాంచి’ కులం. మోదీ జన్మించినప్పుడు ఆయన కులం ఓసీ జాబితాలో ఉండేది. మండల్ కమిషన్ సిఫారసుతో గుజరాత్ ప్రభుత్వం 1994లో ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. అప్పటికి మోదీ ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ మోదీ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీల్లో చేర్చారని సీఎం రేవంత్ అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Similar News
News April 10, 2026
IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.
జట్లు:
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, హేజల్వుడ్.
RR: జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్మెయిర్, ఫెరీరా, జడేజా, బర్గర్, ఆర్చర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేశ్.
* వైభవ్ IMPACT
News April 10, 2026
ఇరాన్ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

ఇరాన్లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్ట్రీమ్గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.
News April 10, 2026
IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

IPL అభిమానులకు గుడ్న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.


