News May 10, 2024

దేశంలో శాకాహారుల శాతం ఎంతంటే?

image

దేశవ్యాప్తంగా 29 శాతం మంది శాకాహారులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, రాష్ట్రాల వారిగా వీరి సంఖ్య భిన్నంగా ఉంది. దేశంలో అధికంగా రాజస్థాన్‌లో 75శాతం మంది శాకాహారులున్నారు. టాప్-5లో హర్యానాలో 70శాతం, పంజాబ్‌లో 67శాతం, గుజరాత్‌లో 61శాతం, హిమాచల్ ప్రదేశ్ 53శాతం ఉన్నాయి. లక్షద్వీప్‌లో ఒక్కరూ కూడా శాకాహారులు లేకపోవడం గమనార్హం. ఇక TGలో 1.3%, APలో 1.7% మంది మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు.

Similar News

News December 4, 2025

ఇండియాలో పుతిన్‌ను అరెస్టు చేస్తారా?

image

ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్‌ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్‌స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్‌ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.

News December 4, 2025

CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <>దరఖాస్తుకు<<>> చివరి తేదీ: డిసెంబర్ 22.

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.