News March 2, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడిప్పుడే బర్డ్ ఫ్లూ భయం నుంచి బయట పడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.180గా ఉంది. ఇతర జిల్లాల్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.210, కాకినాడలో రూ.150-170 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
కర్నూలు: మంటలు అంటుకొని బాలుడి మృతి…!

స్నానానికి వేడి నీరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్దకడబూరుకు చెందిన వడ్డే ప్రవీణ్ కుమార్(6) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగగా చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితికి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


