News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 18, 2025

భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

image

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్‌లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్‌లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్‌పుత్ క్షమాపణలు చెప్పారు.

News December 18, 2025

SMAT ఫైనల్.. ఝార్ఖండ్ భారీ స్కోర్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో ఝార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 పరుగులు చేసింది. హరియాణా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇషాన్ కిషన్ 101(49B), కుమార్ 81(38B), అనుకుల్ రాయ్ 40(20B), రాబిన్ 31*(14B) అదరగొట్టారు. విజయం కోసం హరియాణా 263 స్కోర్ చేయాల్సి ఉంది.

News December 18, 2025

వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.