News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 1, 2026

ఖురాన్‌పై ప్రమాణం చేసిన న్యూయార్క్ మేయర్ మమ్‌దానీ

image

న్యూయార్క్ నగర మేయర్‌గా భారత మూలాలున్న జోహ్రాన్ మమ్‌దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ఆయన ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా నిలిచారు. 1945లో మూసివేసిన సిటీ హాల్ IRT సబ్‌వే స్టేషన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అద్దెల నియంత్రణ, ఫ్రీ బస్సు సర్వీస్, ఫ్రీ చైల్డ్‌కేర్ వంటి హామీలతో మమ్‌దానీ ఎన్నికల్లో గెలిచారు. నిధుల కోసం సంపన్నులపై పన్నులు పెంచుతామని ప్రకటించారు.

News January 1, 2026

నితీశ్ ఆస్తులు: ₹1.48 కోట్ల ఫ్లాట్.. ₹11.32 లక్షల కారు

image

బిహార్ CM నితీశ్ కుమార్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు 2025 చివరి రోజు నాటికి వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు. నితీశ్ చేతిలో ₹20,552 నగదు, మూడు బ్యాంక్ అకౌంట్లలో కలిపి ₹57,766 అమౌంట్ ఉంది. ₹2.03 లక్షల విలువ చేసే జువెలరీ, ₹11.32 లక్షల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఆస్తుల లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం ఆయన చరాస్తుల విలువ ₹17,66,196. అలాగే ₹1.48 కోట్ల మార్కెట్ విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ (2/2)

image

☛ పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2.0 ml. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీలలో ఏదో ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ మారుకా మచ్చల పురుగు ఉద్ధృతి అధికంగా ఉంటే స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా రైనాక్సిపిర్ 0.3 మి.లీ (లేదా) ప్లుబెండిఎమైడ్ 0.2 మిల్లీలీటరును ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.