News September 23, 2024
మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 23, 2025
సొసైటీల ఎన్నికలు రద్దు?

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో వందశాతం పదవులు కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కనున్నాయి. ఎన్నికల ఖర్చూ మిగలనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News December 23, 2025
సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 23, 2025
KCR, హరీశ్కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. మాజీ CM KCRతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు SIT నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో చెప్పారని తెలుస్తోంది. దీంతో KCR, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత HYD CP సజ్జనార్ నేతృత్వంలోని SIT నోటీసులు ఇవ్వనుంది.


