News August 6, 2024
BNP-జమాతే కూటమి వస్తే ఏం జరుగుతుంది?

బంగ్లాదేశ్లో సైన్యం సహకారంతో BNP-జమాతే కూటమి అధికారాన్ని చేపడితే భారత వ్యతిరేక శక్తులు మళ్లీ తయారవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్తో ఉన్న మైత్రి బంధం కారణంగా షేక్ హసీనా తన హయాంలో మతఛాందస శక్తులపై ఉక్కుపాదం మోపారు. అయితే, ఇప్పుడు పాక్ పెంచి పోషించిన ఉగ్రసంస్థల వల్ల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు తప్పకపోవచ్చని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
News December 7, 2025
సేంద్రియ ఎరువులతో సాగుకు లాభం

సేంద్రియ ఎరువులు నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి. మొక్కలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. సేంద్రియ పదార్ధాలు భూమిలో మరింత మార్పుచెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టిఉంచి మొక్కకు సమర్ధవంతంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, నులిపురుగుల ఉద్ధృతి, చీడపీడల తాకిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.


