News October 8, 2025
మీరు వద్దనుకున్నవి.. వారికి సంతోషాన్నిస్తాయి!

దీపావళి సందర్భంగా అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయట పారేస్తుంటారు. అయితే పనికొచ్చే వస్తువులను, దుస్తులను పడేసే ముందు ఓసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే ఆ వస్తువులు ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులను అవసరమైన వాళ్లకు ఇచ్చేందుకు ముందుకురండి. చాలా NGOలు, శరణాలయాలు వీటిని స్వీకరిస్తాయి. SHARE IT
Similar News
News March 23, 2026
హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్సైట్: <
News March 23, 2026
సంచలన ప్రకటన.. యుద్ధానికి బ్రేక్

ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 5 రోజుల పాటు దాడులు ఆపనున్నట్లు వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్ఫ్రాపై మిలిటరీ స్ట్రైక్స్ను వాయిదా వేస్తున్నామని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 2 రోజులపాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. చర్చలు ఈ వారం మొత్తం కొనసాగుతాయని తెలిపారు.
News March 23, 2026
గల్ఫ్ రూట్లను మైన్స్తో నింపేస్తాం: ఇరాన్ హెచ్చరిక

తమ దేశ తీరం, ద్వీపాలపై దాడికి యత్నిస్తే గల్ఫ్ రూట్లను సీమైన్స్తో నింపేస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫ్లోటింగ్ మైన్స్ను తీరం నుంచే రిలీజ్ చేస్తామని స్పష్టంచేసింది. అదే జరిగితే హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే గల్ఫ్ అంతటా సుదీర్ఘకాలం ఉంటుందని చెప్పింది. 1980ల్లో పెట్టిన సీమైన్స్ను తొలగించేందుకు మైన్ స్వీపర్లు ప్రయత్నించి ఫెయిలైన విషయం మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.


