News January 30, 2025
నేటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు

AP: రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు.
Similar News
News February 13, 2025
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

TG: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టినట్లు కొన్ని కాలేజీలపై ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను https://tgbie.cgg.gov.in/ <
News February 13, 2025
జూన్లో ‘స్థానిక’ ఎన్నికలు?

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.
News February 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా శిఖర్ ధవన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్గా నియమితులయ్యారు. అతనితో పాటు PAK క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, AUS మాజీ ఆల్రౌండర్ వాట్సన్, NZ మాజీ పేసర్ సౌథీని ICC అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. 2013లో భారత్ CT గెలవడంలో గబ్బర్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, టోర్నీ చరిత్రలో వరుసగా 2సార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచినందుకు శిఖర్కు ఈ గౌరవం దక్కింది.