News July 27, 2024
భారత్లో వాట్సాప్ నిలిచిపోదు: కేంద్రం

భారత్లో వాట్సాప్ సేవలు నిలిపివేసే ఆలోచన మెటా సంస్థకు లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా? అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ప్రశ్నించారు. సర్వీసుల నిలిపివేతపై తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని వైష్ణవ్ బదులిచ్చారు. కాగా వాట్సాప్లో ఎన్క్రిప్షన్ విధానం తొలగించాలని కేంద్రం ప్రతిపాదిస్తే తాము భారత్లో సేవలు నిలిపివేస్తామని మెటా గతంలో వ్యాఖ్యానించింది.
Similar News
News February 16, 2025
KCR బర్త్డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.
News February 16, 2025
WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.
News February 16, 2025
మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.